బెంగాల్ రైలు ప్రమాదంపై పోలీసుల ప్రకటన (వీడియో)

63చూసినవారు
పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు డార్జిలింగ్ ASP అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20-25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీకొట్టినట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.