రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం లోక్సభలో మాట్లాడే అవకాశాలున్నాయి. నిన్న ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ.. కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులని చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసకు పాల్పడుతున్నట్లు రాహుల్ తన ప్రసంగాల్లో ఆరోపించారు. ఆ వ్యాఖ్యల పట్ల సభలో ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలకు మోదీ ఎలా కౌంటర్ ఇస్తారన్న ఆసక్తి నెలకొంది.