జవహర్ నవోదయలో ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్థులపై చర్యలు

62చూసినవారు
జవహర్ నవోదయలో ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్థులపై చర్యలు
అరుణాచల్ ప్రదేశ్ లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో వారి వీపు, కాళ్లు కమిలిపోయాయి. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం.. ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకుంది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్