రేపు ఏపీలో వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ

75చూసినవారు
రేపు ఏపీలో వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో రేపు (సోమవారం) కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్.. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్