అసదుద్దీన్ పై రాజాసింగ్ ఫైర్

79చూసినవారు
అసదుద్దీన్ పై రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకార సమయంలో జై భీమ్, జైతెలంగాణ, జై పాలస్తీనా చేసిన నినాదాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. భారత్ మాతాకీ జై, జై భారత్ అని నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఏ దేశంలో ఉంటున్నావు, ఏ దేశంలో తిండి తింటూ, ప్రశాంతంగా బతుకుతున్నారో ఆ దేశానికి జై కొట్టడానికి ఎందుకు నోరు రావడం లేదని ఫైర్ అయ్యారు.