కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు నిబంధనలు తీసుకొచ్చాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. పార్లమెంటరీ విధానంలోని రూల్ 267 ప్రకారం నోటీసులు దాఖలు చేశారన్నారు. ఇది అత్యవసర, తక్షణ చర్చ కోసం నోటీసు అని పేర్కొన్నారు.