రామోజీరావు ఆదుకున్నారు: కేరళ సీఎం

51చూసినవారు
రామోజీరావు ఆదుకున్నారు: కేరళ సీఎం
రామోజీరావు మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌ సంతాపం వ్యక్తం చేశారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని గుర్తుచేశారు. వరదలు అతలాకుతలం చేసినపుడు అండగా నిలిచారని చెప్పారు. వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్‌ ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్