ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ శశాంకతోపాటు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, డీఆర్ సంగీతకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.