

ఇబ్రహీంపట్నం: చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్నా
మాసబ్ చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే చెరువు శిఖం భూమి 137 సర్వే నంబర్లో అక్రమంగా డంప్ చేసిన మట్టిని తొలగిస్తున్నామని తెలిపారు. వినాయకుడి నిమజ్జనాల సమయంలోని వ్యర్థాలను వెంటనే తొలగించాలని కమిషనర్ అమరేందర్ రెడ్డిని ఆదేశించారు. చెరువు పరిరక్షణ సమితి సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఎన్టీఎల్ పరిధి, తుర్కయంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 205లో అక్రమంగా డంప్ చేసిన మట్టిని తొలగించాలని వినతిపత్రం అందజేశారు.