అనుమానస్పద రీతిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గుర్తు పట్టలేని స్థితిలో కుళ్ళిన మృతదేహం స్థానికులకు కనిపించడంతో గ్రామస్తులు గుమిగూడారు. శవం పూర్తిగా కుళ్లిపోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో స్థానిక పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు అందించారు.