నాటుసారా తయారి కేంద్రాలపై అబ్కారీశాఖ దాడులు

80చూసినవారు
స్థానికుల సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో ఎంఫోర్స్ మెంట్, హయత్ నగర్ ఆబ్కారీ సీఐ, ఆమనగల్లు అబ్కారీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం మూడు టీమ్ లు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400లీటర్ల బెల్లం ధ్వసం చేసి, 12లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఆబ్కారీ శాఖ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్