త్రిపురలో రికార్డు స్థాయిలో ఓటింగ్

68చూసినవారు
త్రిపురలో రికార్డు స్థాయిలో ఓటింగ్
దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో త్రిపురలో 80.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 77.7 శాతం, మేఘాలయలో 74.21 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా బీహార్ 48.50 శాతం ఓటింగ్ జరిగింది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.
Job Suitcase

Jobs near you