రైతులు ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు చీడపీడలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువవుతుంది. పురుగు జీవితచక్రం పూర్తి చేసుకుని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. అదే పంట మార్పిడి చేస్తే పురుగు జీవితచక్రం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై మనుగడ సాధించలేవు. ఒకే లోతు వ్యవస్థ కలిగిన పంటలను సాగుచేయటం వల్ల నేల నిస్సారమవుతుంది.