నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి స్టైఫండ్‌ రిలీజ్

64చూసినవారు
నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి స్టైఫండ్‌ రిలీజ్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు నిధులు విడుదల చేసింది. 2024-25 కు సంబంధించిన రూ.406 కోట్ల స్టైఫండ్ నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, టీచింగ్ మెడికల్ స్టాఫ్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.