బద్రీనాథ్ హైవేపై రాకపోకల పునరుద్ధరణ

58చూసినవారు
బద్రీనాథ్ హైవేపై రాకపోకల పునరుద్ధరణ
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల కారణంగా విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. ఈ మేరకు చమోలీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో ఇటీవల ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఛమోలీ జిల్లాలోని బహనీర్పానీ , జోషీమఠి రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్