ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన విప్లవ కవి శ్రీశ్రీ

56చూసినవారు
ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన విప్లవ కవి శ్రీశ్రీ
తన రచనలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన విప్లవ కవి శ్రీశ్రీ. జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి మహాప్రస్థానం. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు రాశారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే...', 'మరో ప్రపంచం', 'నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితరసాధ్యం నా మార్గం' తదితర కవితలు ఆయన రాసినవే.