TG: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులోని వాగు దగ్గర రన్నింగ్లో ఒక్కసారిగా టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.