హైదరాబాద్లో మెట్రో లేని మార్గాల్లో 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్- మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47ఎల్ నంబరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222 ఎల్(లింగంపల్లి – కోఠి) బస్సులకు సైతం సమయాలను ఇప్పటికే నిర్దేశించారు. ఈ రెండు రూట్లలో ప్రయోగాత్మకంగా 10 నిమిషాలకో బస్సు నడపనున్నారు. ఈవిషయాన్ని గ్రేటర్జోన్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.