ఏసీబీ వలలో చిక్కిన శామీర్‌పేట తహసీల్దార్

548చూసినవారు
ఏసీబీ వలలో చిక్కిన శామీర్‌పేట తహసీల్దార్
తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలలో చిక్కాడు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసేందుకు సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం అడిగాడు. దాంతో బాధితుడు ఏసీబీకి ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్