సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల చిమ్మాపూర్ లోని ఎస్ ఆర్ ఆర్ ట్రేడర్స్ లో మంగళవారం ఘరానా మోసం వెలుగు చూసింది. వినియోగదారులు విక్రయించిన వస్తువుల తయారీ ధరపై నకిలీ ఎమ్మార్పీ రేట్లు ముద్రించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వినియోదారుడు నోట్ బుక్స్ కొనుగోలు చేసేందుకు వెళ్ళగా వ్యవహారం బయటపడింది.