సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ ఉష్ణోగ్రత వివరాల ప్రకారం గురువారం ఉదయం పటాన్ చెరులో 20. 6 డిగ్రీలు, గుమ్మడిదలలో 20. 1 డిగ్రీలు, జిన్నారంలో 20. 0 డిగ్రీలు, అమీన్ పూర్ లో 20. 8 డిగ్రీలు, రామచంద్రాపురంలో 20. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 96. 0%గా ఉంది. పలు ప్రాంతాలలో చిరుజల్లులు పడ్డాయి. జిన్నారం మండలంలో సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది.