

అన్నారం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ
గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుమ్మడిదల బిజెపి అధ్యక్షుడు ఐలేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.