ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షలు

85చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపించారు. ఉదయం 9 గంటలకు తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్ష ప్రారంభమైంది. తొలి రోజు 2, 329 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్