రేపే సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్

76చూసినవారు
రేపే సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్
లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం రెండో దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 26న) జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలు, కర్ణాటక-14, రాజస్థాన్-13, మహారాష్ట్ర- 8, ఉత్తర్‌ప్రదేశ్-8, మధ్యప్రదేశ్-6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదుస్థానాలు, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లోని చెరో స్థానానికి పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్