యూపీలో దారుణ ఘటన జరిగింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్ రింగ్, టీవీ గిఫ్ట్గా ఇచ్చాడు. దీనిపై అతని భార్య గిఫ్ట్ ఎందుకు ఇచ్చావని గొడవ పడింది. రెండు గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. దీంతో ఎలాగైనా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుని తన సోదరుడితో భర్తపై దాడి చేయించింది. ఈ దాడిలో చంద్రప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మృతుని భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్ట్ చేశారు.