సంగారెడ్డి: వాసవి దేవాలయంలో వేడుకలు

83చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. దేవాలయం కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు లలిత సహస్ర పారాయణం, అమ్మవారి చరిత్రను చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.