కోహిర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.