ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో, పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛ హరించడమే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచి-2024లో భారత్ 180 దేశాలలో 159వ స్థానానికి పరిమితం కావడమే దీనికి నిదర్శనం.