తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి బడ్జెట్లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.