తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో మంగళవారం ఊహించని ప్రమాదం జరిగింది. సూలూరు పక్కనే ఉన్న నీలంపూర్లో చైతన్య స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని ఎప్పటిలాగానే జేజే నగర్కు వెళ్తోంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో అదుపు తప్పి 7 అడుగుల గోతిలోకి బోల్తా పడింది. ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
చిన్నారులను స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు.