మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్న వారందరినీ గుర్తించి పంపిస్తామని ప్రకటించారు. ఇంఫాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవలి హింస మరియు అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్, ముఖ్యంగా మయన్మార్ నుండి వచ్చిన శరణార్థులు కారణమని అన్నారు.