పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య

83చూసినవారు
పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య
జానీ మాస్టర్ భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది, మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్