శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తజన కోలాహలం (వీడియో)

63చూసినవారు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగలా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేసిన మలయప్పస్వామివారి రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీపడ్డారు. దీంతో మాడవీధులు గోవింద నామ స్మరణతో మారుమోగాయి. అడుగడుగునా భక్తజన నీరాజనాల మధ్య నిత్య కళ్యాణ మూర్తి ఊరేగారు. నేటి రాత్రి స్వామివారు కల్కి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. రేపు చక్రస్నానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్