పురుగుల మందు తాగి ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

83చూసినవారు
పురుగుల మందు తాగి ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. 108కు ఫోన్ రాగా.. వెంటనే అంబులెన్స్‌లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్