2018 జాతీయ వ్యవసాయ గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 54% ప్రజలు, 50% కిపైగా శ్రామికశక్తి వ్యవసాయ రంగంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రంగం దేశ జీడీపీలో 17% వాటా కలిగి ఉంది. భారత్ 328.73 మిలియన్ హెక్టార్ల భౌగోళిక వైశాల్యంతో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. వ్యవసాయ భూమి పరంగా ప్రపంచంలో 11% వాటాతో భారత్ మొదటి స్థానంలో ఉంది.