మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) అవకతవకల కేసుకు సంబంధించి కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు కాషాయ పార్టీ డిమాండ్ చేయడంపై సీఎం స్పందించారు. ఈ అంశంపై తాను ఇప్పటికే విచారణకు ఆదేశించానని అన్నారు. అయితే తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేసినప్పుడు వారు ఏ కేసైనా సీబీఐకి అప్పగించారా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతి కేసుకూ
బీజేపీ ఎందుకు సీబీఐ విచారణను కోరుతోందని ఆయన నిలదీశారు.