హుస్నాబాద్ మండల కేంద్రంలో శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. హుస్నాబాదు లో మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, చిన్న ముల్కనూరు, చిగురుమామిడి మండలం సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పిస్తారు.