హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు కట్ట వరకు స్థానిక
కాంగ్రెస్ నాయకులతో కలిసి వాకింగ్ చేశారు. అనంతరం పేపర్ వేస్తున్న పిల్లవాడిని పలకరించి రోడ్డు పక్కన టీ హోటల్లో చాయ్ తాగి ఓటింగ్ సరళిని గురించి అడిగి తెలుసుకున్నారు.