సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. హుస్నాబాద్ పలు వార్డులలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన పేరుతో గురువారం నుండి ప్రారంభించారు. హుస్నాబాద్ 20 వార్డులలో ప్రజాపాలన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు.