పెళ్లి బస్సు, లారీ ఢీ.. పలువురికి గాయాలు

36467చూసినవారు
నిజాంపేట గ్రామ శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి టూరిస్టు బస్సును లారీ ఢీకొట్టింది. సిద్ధిపేట నుంచి వస్తున్న పెళ్లి టూరిస్టు బస్సును రామయంపేట నుంచి వస్తున్న లారీ అతివేగంతో ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్