సంగారెడ్డి జిల్లా పటన్ చెరులోని గోకుల్ నగర్ కాలనీలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం జరిగింది. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఏటీఎంలో వైర్లను కట్ చేసి బ్యాటరీ చోరీకి యత్నం చేశారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వ్యక్తిని చూసి దుండగులు పారిపోయారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.