అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

83చూసినవారు
అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు టి. మనోజ్ఞ ఓ. సౌజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజకుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఈ నెల 19 నుండి 20 వరకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.

సంబంధిత పోస్ట్