గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

2974చూసినవారు
గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో గల తెలంగాణ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల, హుజురాబాద్ (బాలికల) లో 2023 -24 విద్య సంవత్సరానికి గాను 5వ తరగతి లో ప్రవేశం పొందడానికి అర్హత గల విద్యార్థులు మార్చి 6వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మంజుల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.tswreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని,ఒక్క సెల్ ఫోన్ నంబర్తో ఒక్క దరఖాస్తుకు మాత్రమేవీలుంటుంది.అలాగే పాతజిల్లా యూనిట్ గా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్