గురుకుల ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు

1384చూసినవారు
గురుకుల ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, హుజురాబాద్ (బాలికల)లో 2023-24 విద్య సంవత్సరానికి గాను 5వ తరగతి లో ప్రవేశం పొందడానికి అర్హత గల విద్యార్థుల దరఖాస్తు గడువు ను మార్చి 16వ తేది నుండి 20 తేది వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www. tswreis. telangana. gov. in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఒక్క సెల్ ఫోన్ నంబర్తో ఒక్క దరఖాస్తుకు మాత్రమేవీలుంటుంది, గ్రామీణ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రుల ఆదాయం రూ 150000, పట్టణ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రుల ఆదాయం రూ 2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్ 180042545678 ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్