ఓ వృద్ధుడు మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్లో చోటు చేసుకుంది. ఏడో తరగతి విద్యార్థినిపై గంగనర్సయ్య అనే వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. టైలర్ పని చేస్తున్న గంగనర్సయ్య అతని దుకాణంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు.