లోకసభ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఆదివారం టి మోహన్ లోకసభ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ నెంబర్ 210, 207, 208 లో మోడల్ కోడ్ ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. మిగతా పోలింగ్ బూత్ సంబంధించిన మెటీరియల్ ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. ప్రజలందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోగలరని తెలిపారు.