17న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం

74చూసినవారు
17న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం
భద్రాచలం రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 16న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు మహోత్సవం, 17న మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణోత్సవం, 18న రాములవారి మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు. కళ్యాణం, పట్టాభిషేకం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు.

ట్యాగ్స్ :