ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర విషాద ఘటన సంభవించింది. న్యూ బోర్న్ బేబీకేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు శిశువులు చనిపోయారు. 12 మందిని ఢిల్లీ ఫైర్ సిబ్బంది రక్షించారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై ఉంచారు. మరో ఐదుగురు చిన్నారులు సైతం చికిత్స పొందుతున్నారు.