మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో విషాదం చోటుచేసుకుంది. అల్లుడి మరణం తట్టుకోలేక రోధిస్తూ గుండెపోటుతో అత్త మృతి చెందింది. అనారోగ్యంతో ఆదివారం ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు నర్సింలు (53) మృతి చెందాడు. దీంతో అత్త నర్సవ్వ(68) రాత్రంతా రోధిస్తూ గుండెపోటుతో మృతి చెందింది.