టీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండటంతో స్టాఫ్పై పనిభారం పెరుగుతోంది. ఇటీవల పోస్టుల భర్తీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.